18/07/2026
ఈ రోజు విజయవాడలో నిర్వహించిన బీజేపీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జీలు, BLA-1ల సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారు పాల్గొని బూత్ స్థాయి సంస్థాగత బలోపేతంపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షిస్తూ, ప్రతి బూత్ను మరింత బలోపేతం చేయడం, ప్రతి ఓటరిని చేరుకోవడం, గ్రామ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని విస్తరించడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా చేసుకుని కార్యాచరణను రూపొందించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారు,జాతీయ కార్యదర్శి శ్రీ రితురాజ్ సిన్హా గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ గారు పాల్గొని పార్టీ బలోపేతం, బూత్ నిర్వహణ, ఓటరు నమోదు కార్యక్రమాలపై విలువైన సూచనలు అందించారు.
"బలమైన బూత్లే... బీజేపీ విజయానికి బలమైన పునాది!" 🪷🇮🇳
[